Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కడపలో కత్తితో యువతి హల్‌చల్.. ఎవరిని బెదిరించిందో తెలిస్తే షాకే...

కడప జిల్లాలో ఒక యువతి కత్తితో హల్చల్ చేసింది. తనకు సంబంధించిన భూములపై విచారణ చేసేందుకు వచ్చిన రెవిన్యూ, పోలీసుల అధికారులను కత్తితో చంపేస్తానని బెదిరించింది. యువతి చేస్తున్న రాద్దాంతం చూసి పోలీసులే భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. చిట్వేలు మండలం కందులవారిప

కడపలో కత్తితో యువతి హల్‌చల్.. ఎవరిని బెదిరించిందో తెలిస్తే షాకే...
, బుధవారం, 1 ఆగస్టు 2018 (11:30 IST)
కడప జిల్లాలో ఒక యువతి కత్తితో హల్చల్ చేసింది. తనకు సంబంధించిన భూములపై విచారణ చేసేందుకు వచ్చిన రెవిన్యూ, పోలీసుల అధికారులను కత్తితో చంపేస్తానని బెదిరించింది. యువతి చేస్తున్న రాద్దాంతం చూసి పోలీసులే భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. చిట్వేలు మండలం కందులవారిపల్లిలో అనసూయమ్మకు 8 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలం పక్కనే స్మశానం కూడా ఉంది.
 
అనసూయమ్మ తన స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ స్మశానాన్ని కూడా కొంత ఆక్రమించేసి కంచె కట్టింది. కొంతమంది స్థానికుల ఫిర్యాదుతో రెవిన్యూ అధికారులు విచారణ చేసేందుకు అనసూయమ్మ పొలం వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న అనసూయమ్మ ఆమె మనవరాలు కవిత తమ స్థలం వద్దకు కత్తి పట్టుకుని వచ్చింది.
 
ఈ భూముల్లో కొంత మీరు ఆక్రమించారు. మీ స్థలం ఇది కాదంటూ రెవిన్యూ అధికారులు చెబుతుండగా కవిత కత్తితో రెవిన్యూ అధికారులను బెదిరించింది. ఎవరైనా స్థలంలోకి వస్తే నరికేస్తానంటూ బెదిరింపులకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా స్థలం వద్దకు చేరుకున్నారు. పోలీసులను కూడా కవిత బెదిరించడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. యువతిపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు రేప్.. ఇద్దరు పోలీసులు కూడా?