Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ హయాంలో అక్రమాలు.. ఒక్కొక్కటీ వెలుగులోకి.. 76 వైసీపీ ఎస్ఎం వర్కర్లకు...?

Advertiesment
ysrcp flag

సెల్వి

, బుధవారం, 19 జూన్ 2024 (10:35 IST)
వైకాపా చీఫ్ జగన్ సీఎంగా గత ప్రభుత్వం చేసిన అక్రమాలు అంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) కార్యాలయాన్ని కూడా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
ఏపీఎస్ఎస్‌డీసీ వారు కార్పొరేషన్‌లో పని చేయనప్పటికీ డెబ్బై ఆరు మంది ఉద్యోగులకు ఐదేళ్లపాటు జీతాలు చెల్లించారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మారడంతో సంస్థలో జరుగుతున్న అవినీతిపై ఉద్యోగులు పెదవి విప్పుతున్నారు. ఈ డెబ్బై ఏడు మంది ఉద్యోగులు వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.
 
ఏపీఎస్ఎస్‌డీసీ ప్రజల సొమ్మును జీతాల రూపంలో చెల్లించారన్నది ఆరోపణ. కాగా చల్లా మధుసూధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. 2021లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) ఛైర్మన్‌గా, రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధికి సలహాదారుగా నియమించబడ్డారు. 
 
జర్మన్ ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి, బిల్లు క్లియరెన్స్ కోసం ఆయన 30 లక్షల రూపాయల కమీషన్ తీసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగానికి నిధుల మళ్లింపు, అక్రమాలకు సంబంధించి ఆయన విచారణలో పడ్డారు.
 
ఏపీఎస్ఎస్‌డీసీ నుండి లబ్ది పొందిన ఈ సోషల్ మీడియా వర్కర్లలో చాలా మంది ఇప్పటికే తమ ఖాతాలను డియాక్టివేట్ చేసారు. సోషల్ మీడియా నుండి పారిపోయారు. వీరిలో కొందరు న్యాయవ్యవస్థ దుర్వినియోగంలో గతంలో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఘాయిత్యం చేసిన జైలుకెళ్లిన నిందితుడు.. షాకిచ్చిన కర్నాటక హైకోర్టు!!