Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యమపాశంలా మారిన కరెంట్ తీగలు.. సైకిల్‌పై వెళ్తున్న బాలుడు మృతి.. ఎలా? (వీడియో)

Students Electrocuted

సెల్వి

, బుధవారం, 21 ఆగస్టు 2024 (18:30 IST)
Students Electrocuted
కరెంట్ తీగలు పడివుండటాన్ని ఆ బాలుడు చూడలేదు. సంతోషంగా సైకిల్ తొక్కుతూ స్నేహితుడిని వెంటబెట్టుకుని వెళ్తున్నాడు. అయితే జరగకూడనది జరిగిపోయింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వీధిలో విద్యుత్‌ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కడప జిల్లాల చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కడప నగరంలోని బెల్లం మండి వీధి బళ్లారి రోడ్డులో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తన్వీర్‌ (11) అద్నాన్.. ఇద్దరు చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. స్కూలుకు వెళ్లి లంచ్ కోసం ఇంటికి వచ్చి లంచ్ చేసి సైకిల్‌పై స్కూలుకు వెళ్తున్నారు. కరెక్ట్‌గా వీధి టర్నింగ్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మార్‌ నుంచి కరెంట్‌ వైర్లు రోడ్డుపైకి వేలాడాయి. యమపాశాల్లా వేలాడుతున్న కరెంట్ వైర్లను సైకిల్‌పై వెళ్తున్న ఆ చిన్నారులను తాకాయి. దీంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.. తన్వీర్ ఘటనా స్థలంలోనే కన్నుమూశాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండంగా.. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బాబు ప్రాణాలు తీసిందని.. స్థానికులు ఆందోళనకు దిగారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ వీడియోను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు.. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలానే ప్రభుత్వం నుంచి చనిపోయిన విద్యార్థికి ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థికి ఖర్చులు భరాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్కెట్లలో 'నకిలీ' వెల్లుల్లి.. సిమెంట్‌తో తయారు చేసింది..