Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారం వుందట...

అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారం వుందట...
, సోమవారం, 27 సెప్టెంబరు 2021 (14:51 IST)
అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలు వున్నట్లు గనుల శాఖ నిర్థారించింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 16 టన్నుల బంగారం వుంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు వుండవచ్చని తెలిపారు.
 
ఇంకా రామగిరిలో 4 టన్నులు, బొక్సంపల్లిలో 2 టన్నులు బంగారం వుంటుందని చెప్పారు. ఒక టన్ను మట్టి తవ్వి తీస్తే 4 గ్రాముల బంగారం లభిస్తుందని చెపుతున్నారు. ఐతే భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత లోతుకు వెళ్లేకొద్దీ బంగారు నిక్షేపాలు అధికంగా వున్నట్లు గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెయిర్ కట్టింగ్‌, గడ్డం షేవింగ్‌ చేయకూడదు.. మరో బాంబు పేల్చిన తాలిబన్లు