Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్.వివేకా హత్య : సిట్ అదుపులో వైఎస్.జగన్ ముఖ్య అనుచరుడు

Advertiesment
YS Vivekananda Reddy Murder
, శుక్రవారం, 22 మార్చి 2019 (12:18 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మరోముఖ్య అనుచరుడు నాగప్ప, కుమారుడు శివల వద్ద సిట్ బృందం ప్రశ్నిస్తోంది.
 
ఈనెల 15వ తేదీన తన ఇంట్లోని బాత్రూమ్‌లో వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైన విషయంతెల్సిందే. ఈ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదిస్తున్నారు. ఇందులోభాగంగా ఈ కేసును విచారించేందుకు ఏపీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. 
 
ఈ బృందం అనేక మందిని అదుపులోకి తీసుకుని అనేక కోణాల్లో విచారిస్తోంది. ముఖ్యంగా, హత్యకు గల కారణాలను ఆరా తీస్తోంది. అనుచరులే ఆయన్ని చంపేశారా? ఆస్తి తగాదాలే ముఖ్య కారణమా? వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. 
 
మరోవైపు, ఈ హత్య వెనుక పరమేశ్వర్‌ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అనే వారు సూత్రధారులుకాగా, పాత్రధారిగా చంద్రశేఖర్‌రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వీరందరినీ అదుపులోకి తీసుకుని వివిధ చోట్ల ఉన్న రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందు మీ ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ మార్చండి.. ప్లెయిన్ టెక్ట్స్‌లోనే పాస్‌వర్డులు