Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అప్పులు చేసి అమ్మఒడి ఇస్తారా, రాష్ట్రం సర్వనాశనమవుతోంది: సోము వీర్రాజు

Advertiesment
loans
, సోమవారం, 11 జనవరి 2021 (15:13 IST)
రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టి ప్రభుత్వం అమ్మఒడి ఇస్తోందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసిపి నేతలను తరిమితరిమి కొట్టండంటూ పిలుపునిచ్చారు సోము వీర్రాజు.
 
రాష్ట్రాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు నిలువునా దోచేస్తున్నారని.. టిడిపి హయాంలో కూడా గతంలో అదే జరిగిందన్నారు. అవినీతి, అక్రమాలు చేయడం వైసిపి నేతలకు దినచర్యగా మారిపోయిందన్నారు. ఎపి ప్రభుత్వం కట్టే ఇళ్లన్నీ కేంద్రం ఇచ్చే నిధులేనన్నారు. 
 
అభివృద్ధి చేసేది బిజెపినే కాబట్టి.. ఓట్లు అడిగే హక్కు బిజెపికే ఉందన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో బిజెపి.. జనసేన అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్దిని వివరిస్తూ ప్రజల్లోకి వెళతామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం దుకాణాల వద్ద డ్యూటీ ముద్దుగా ఉంటుందా? టీడీపీ