Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమికుడి కోసం కట్టుకున్న భర్తను దూరం చేసుకుంది.. చివరికి?

ప్రేమికుడి కోసం ఓ మహిళ భర్తను చంపించింది. ప్రియుడి మోజులో పడి.. భర్తను దూరం చేసుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని కుమ్మర వీధిక

Advertiesment
Wife
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:52 IST)
ప్రేమికుడి కోసం ఓ మహిళ భర్తను చంపించింది. ప్రియుడి మోజులో పడి.. భర్తను దూరం చేసుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని కుమ్మర వీధికి చెందిన సుధాకర్‌ను కట్టుకున్న భార్య వెంకటేశ్వరి తన ప్రియుడు, కిరాయి హంతకుడితో కలిసి హతమార్చింది.

ప్యాపిలికి చెందిన వెంకటేశ్వరికి పదో తరగతి నుంచే రాజేశ్ అనే వ్యక్తితో పరిచయం వుంది. వీరిద్దరూ ప్రేమికులు. అయితే వెంకటేశ్వరి రాజేశ్ కంటే చిన్నవాడు కావడంతో పెద్దలు సమ్మతించలేదు. 
 
అనంతరం వైటీ చెరువుకు చెందిన సుధాకర్‌తో వెంకటేశ్వరి వివాహం చేశారు. పెళ్లి తర్వాత వీరు గుత్తి పట్టణంలోని కురబవధికి మకాం మార్చారు. వీరికి బాలుడు కలిగాడు. వివాహానంతరం రాజేశ్‌తో వెంకటేశ్వరి సంబంధం కొనసాగిస్తుండేది. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యను మందలించాడు. అంతే భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అతనిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది. 
 
కర్నూలుకు చెందిన కిరాయి హంతకుడు శివకుమార్‌తో కలిసి భర్తను హతమార్చింది. ఈ నెల 16 రాత్రి నిద్రపోతున్న భర్తపై వెంకటేశ్వరి.. రాజేశ్, కిరాయి కలిపి హతమార్చారు. అది దొంగల పనిగా నమ్మించేందుకు ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు నగలు, రూ.19 వేల నగదును ప్రియుడు రాజేశ్‌కిచ్చి వెంకటేశ్వరి పంపించేసింది. అనుమానం రాకుండా తనను కట్టేసి, వెళ్లమని చెప్పింది. తరువాత దొంగలు పడ్డారని అరిచింది. 
 
తన భర్తను హత్య చేసి, రూ.5 లక్షల నగదు, 30 తులాల బంగారు దొంగలు ఎత్తుకెళ్లారంటూ వెంకటేశ్వరి పేర్కొనడం పట్టణంలో సంచలనం రేపింది. అయితే పోలీసులు జరిపిన విచారణలో వెంకటేశ్వరి అసలు ముద్దాయి అంటూ తేలింది. దీంతో వెంకటేశ్వరి, రాజేశ్, శివకుమార్ అరెస్టయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2 రోజుల్లో 10 లక్షల స్మార్ట్ ఫోన్స్ సేల్...