Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంద్రకీలాద్రికి సీఎం జ‌గ‌న్... ఏర్పాట్లు ప‌రిశీలించిన జేసీ మాధ‌విల‌త‌

ఇంద్రకీలాద్రికి సీఎం జ‌గ‌న్...  ఏర్పాట్లు ప‌రిశీలించిన జేసీ మాధ‌విల‌త‌
విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (12:52 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను, భక్తులకు కల్పించిన సౌకర్యాలను విజ‌య‌వాడ‌ జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) డా.కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్ (సంక్షేమం)కె.మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ ప‌రిశీలించారు. క్యూలైన్ల ద్వారా దర్శనాన్ని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత ఆదేశించారు. 
 
 
మెట్ల మార్గం నుంచి అంతరాలయం వరకు వున్న ఐదు క్యూలైన్లను నిశితంగా పరిశీలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేని రీతిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. సుమారు రెండు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో, క్యూ లైన్లు, ఓంకారం ప్రాంతాల్లో పర్యటించి భక్తులతో మాట్లాడి వారి ఫీడ్ బ్యాక్ ను కూడా తెలుసుకున్నారు. అనంతరం మంగళవారం ఇంద్రకీలాద్రికి రానున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రోటోకాల్ విధులు నిర్వహిస్తున్నస్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నారాయణరెడ్డి, తహసీల్దార్ బి.భద్రులను విఐపిల రాకపోకలపై జేసీ ఆరా తీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు