Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతిలో వింత ఘటన: భూమి నుంచి పైకి వచ్చిన..?

తిరుపతిలో వింత ఘటన: భూమి నుంచి పైకి వచ్చిన..?
, శుక్రవారం, 26 నవంబరు 2021 (19:03 IST)
తిరుపతిలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ భారీవర్షాల నేపథ్యంలో తిరుపతిలో వింత ఘటన జరిగింది. 
 
తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో భూమి నుంచి సిమెంట్ రింగుల ట్యాంక్ పైకి వచ్చింది. సిమెంటు రింగులతో చేసిన ట్యాంకును శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
25 రింగుల్లో 18 సిమెంటు రింగులు భూమిపైకి వచ్చాయి. ఈ ఘటనలో స్పల్ప గాయాలతో ఓ మహిళ బయటపడింది. అలా పైకి వచ్చిన రింగులను చూసి స్టానికులు అవాక్కయ్యారు. 
 
తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. దీంతో పలువురు నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షాలతో పెన్నా, స్వర్ణముఖి నదులు ఉప్పొంగాయి. 
 
పెన్నా నది ఉప నదులకు కూడా తీవ్రమైన వరదలు వచ్చాయి. పలు నీటి ప్రాజెక్టులు, చెరువుల ఆనకట్టలు తెగిపోవడంతో జనావసాల్లోకి వరదనీరు చొచ్చుకు వచ్చి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్క నాటిన పూజా హెగ్డే