Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

నమ్మించి తీసుకెళ్లాడు.. ఫోన్ చేసి ఫ్రెండ్స్‌ను పిలిచి రేప్ చేశాడు...

Advertiesment
Telangana
, శనివారం, 18 మే 2019 (13:10 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా రాయవరం గ్రామంలో ఓ దళిత యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. తన స్నేహితుడు నమ్మించి తీసుకెళ్లి ఫ్రెండ్స్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాయవరం గ్రామానికి చెందిన 12 యేళ్ళ బాలిక ఇటీవల తన స్నేహితుడుతో కలిసి బైకుపై షికారుకు వెళ్ళింది. అతను షికారుకు తీసుకెళ్లకుండా ఎవరూ లేని చోటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి తన ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రప్పించాడు. 
 
ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ ముగ్గురు కామాంధులు రాత్రంతా లైంగికంగా వేధించారు. మరుసటిరోజు వేకువజామున అక్కడే వదిలేసి పారిపోయారు. 
 
అయితే, రాత్రంతా బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ బాలిక అచేతన స్థితిలో కనిపించింది. ఇంటికి తీసుకెళ్లి ఆరా తీయగా తనకు జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబును వదిలే ప్రసక్తే లేదు.. రైతుల్ని మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం...?