Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంద శాతం కాదు వెయ్యి శాతం గెలుస్తున్నాం: చంద్రబాబు

Advertiesment
Chandrababu
, సోమవారం, 22 ఏప్రియల్ 2019 (13:58 IST)
శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వంద శాతం కాదు.. వెయ్యి శాతం గెలుస్తున్నామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్నారు. 100 శాతం కాదు.. 1000 శాతం గెలుస్తామన్నారు. మన కోసం క్యూలో ఉండి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞలు చెప్పాలని సూచించారు. 'మీరు ముందుండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి.. ప్రజల అవసరాలు తీర్చండి..' అని ఆదేశించారు. 
 
అంతేకాకుండా, తన రాజకీయ చరిత్రలో ఇంతటి దుర్మార్గపు ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నని ఆయన వాపోయారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తమదే విజయమన్నారు. జూన్‌ 8వ తేదీ దాకా మన ప్రభుత్వం ఉందని, ఫలితాలు వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్యాంప్‌ ఆఫీసులో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టుకోవద్దా అని ప్రశ్నించిన బాబు.. ప్రధాని మోడీ మాత్రం మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చా అని నిలదీశారు. మనం మళ్లీ అధికారంలోకి రాకుండా అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టుకు సారీ చెప్పిన రాహుల్