Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణానదిలో పాములు కాదు.. అవి పామును పోలిన చేపలు

Advertiesment
Snakes

సెల్వి

, శుక్రవారం, 21 నవంబరు 2025 (16:39 IST)
Snakes
కార్తీక మాసంలో కృష్ణానదిలో పాములు కనిపించాయని ఇటీవల వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే కృష్ణానదిలో పాములు తిరగలేదని పామును పోలిన చేపలు కనిపించాయి. ఇప్పటివరకు మనం ఎన్నో రకాల చేపలు చూసి ఉంటాం. అయితే పామును పోలిన చేపలు కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద వేలాదిగా దర్శనమిచ్చాయి. వీటిని ఈల్‌ జాతి చేపలు అంటారు. ఇవి నీటిలో ఈదడంతో పాటు నేల మీదా పాకగలవు.
 
అయితే పవిత్ర కార్తిక మాసంలో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో వందలాది నీటి పాములు తరలివచ్చాయని అనుకున్నారు. ఆలయ పరిసరాల్లోని కృష్ణా నది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు అందరికీ షాకిచ్చాయి. కానీ ఇవి పాములు కావని చేపలని జాలరులు తేల్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్తీ నెయ్యి కేసు : ఫ్లేటు ఫిరాయించిన వైవీ సుబ్బారెడ్డి... తూఛ్.. అతను నా పీఏనే కాదు...