Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు... పాఠశాలలకు సెలవు

rain

ఠాగూర్

, సోమవారం, 14 అక్టోబరు 2024 (12:52 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆదివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ ఐదు జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు సోమవారం సెలవు పర్కటించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరించారు. 
 
మరోవైపు, గురువారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చిత్తూరు నుంచి వైజాగ్ వరకు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా సముద్రతీర ప్రాంతాల్లో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలు హెచ్చరించారు. చేపల వేట సముద్రంలోకి వెళ్లినవారు తక్షణం తీరానికి తిరిగి రావాలని వారు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలో ఆగింది.. ఎందుకని? (video)