Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Advertiesment
PVTG Women

సెల్వి

, బుధవారం, 29 అక్టోబరు 2025 (13:11 IST)
PVTG Women
ఉత్తరాంధ్రను తుఫాను మొంథా అతలాకుతలం చేసింది. అనకాపల్లి జిల్లా రావికమఠం మండలం, కళ్యాణ్ లోవా గ్రామంలోని కొండు కమ్యూనిటీకి చెందిన ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహం (పీవీటీజీ) నుండి మహిళలు భారీ వర్షంలో తాగునీరు తీసుకురావడానికి గొడుగులు పట్టుకుని దాదాపు ఒక కిలోమీటరు దూరం నడవాల్సి వచ్చింది. ఈ గ్రామానికి పైపుల ద్వారా నీటి సరఫరా లేకపోవడంతో, నివాసితులు వ్యవసాయ కాలువ నుండి నీటిని సేకరిస్తున్నారు. దీనివల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
 
ఎవరైనా అనారోగ్యానికి గురైన ప్రతిసారీ వేలల్లో ఖర్చు చేస్తున్నామని ఆ గ్రామస్తులు అంటున్నారు. ఇప్పటికే ఈ  గ్రామస్తులు ఏప్రిల్ 25న పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. జల్ జీవన్ మిషన్ కింద, ఆరు నెలల క్రితం నీటి ట్యాంక్ నిర్మించి, కుళాయిలు ఏర్పాటు చేశారు.
 
కానీ ఇప్పటివరకు నీరు సరఫరా చేయలేదని గ్రామీణ నీటి సరఫరా అధికారులు తెలిపారు. ట్యాంక్‌ను ఇంకా పంచాయతీకి అప్పగించాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శి సూచనలు ఇచ్చినప్పటికీ, అప్పగింత పెండింగ్‌లో ఉంది. 
 
కళ్యాణ లోవా, అజయ్‌పురం, పి. కోట్నబెల్లి నివాసితులు, గమేలా సునీత, జి. బంగారమ్మ, జి. రాజు వాసు, ప్రసాద్ పి. చంద్రయ్య, అధికారులను నీటి ట్యాంకులను వెంటనే ప్రారంభించాలని.. మరింత ఆలస్యం చేయకుండా సురక్షితమైన తాగునీటిని పొందేలా చూడాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్