Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైనర్ బాలికపై పశువాంఛ : భార్య చెల్లిని గర్భవతి చేసిన కామాంధుడు... ఎక్కడ?

అక్క భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. తన భార్య చెల్లిపై పశువాంఛ తీర్చుకున్నాడు. ఫలితంగా ఆ మైనర్ బాలిక గర్భందాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామ

Advertiesment
Prakasham
, శనివారం, 30 జూన్ 2018 (09:08 IST)
అక్క భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. తన భార్య చెల్లిపై పశువాంఛ తీర్చుకున్నాడు. ఫలితంగా ఆ మైనర్ బాలిక గర్భందాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

 
ఈ గ్రామానికి చెందిన కొల్లిబోయిన భానుచందర్‌ అనే కామాంధుడు స్థానికంగా ఉండే ఒక రెస్టారెంట్‌లో పని చేస్తున్నాడు. ఈయన ఒంగోలుకు చెందిన ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినా అత్తమామలే ఆదరించి తమతో ఉండేందుకు అవకాశం కల్పించారు. 
 
అయితే, భానుచందర్ భార్యకు ఏడో తరగతి చదువుతున్న 12 యేళ్ల చెల్లి ఉంది. ఈమెపై కన్నేసిన ఆ కామాధుడు.. మాయమాటలు చెప్పి ఆ బాలికను లొంగదీసుకుని, అత్యాచారం చేయసాగాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తిడతారని బాలిక మౌనంగా భరిస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో ఆ  బాలికకు శారీరక సమస్యలు తలెత్తడం, వాంతులు చేసుకుంటుండటంతో బాలికను ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా.. వైద్య పరీక్షలు నిర్వహించి బాలిక గర్భిణి అని తేల్చారు. అబార్షన్‌ చేయడం చట్టరీత్యా నేరం అని.. అబార్షన్‌కు యత్నించినా బాలిక ప్రాణానికి ప్రమాదం అని వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను విచారించి భానుచందరే నిందితుడని తెల్చారు. అతడిని అదుపులోకి తీసుకుని ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువతిపై అత్యాచారం : ఇద్దరు ముద్దాయిలకు 20 యేళ్ల జైలు