Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్రకు ఉపాధి కోసం వెళ్తే.. భర్తను చంపేస్తానని వివాహితపై బంధువే అత్యాచారం చేశాడు..

మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మంలో భర్తను చంపుతానని బెదిరింపులకు గురిచేసి.. ఓ దుర్మార్గుడు వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.

Advertiesment
Khammam crime news
, బుధవారం, 5 అక్టోబరు 2016 (18:07 IST)
మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మంలో భర్తను చంపుతానని బెదిరింపులకు గురిచేసి.. ఓ దుర్మార్గుడు వివాహితపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం కారేపల్లి మండలం చీమలపాడులో సంచారజాతికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి ఉపాధి కోసం 4 నెలల క్రితం మహారాష్ట్రకు వెళ్లింది. 
 
కాగా, ఏన్కూర్ మండలం రాజలింగాలకు చెందిన వీరి బంధువు నెరసుల నరేష్ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో భర్తలేని సమయంలో సదరు మహిళ వద్దకు వచ్చి బెదిరింపులకు గురిచేసి నరేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను చేసిన అఘాయిత్యాన్ని తన స్నేహితుడితో గొప్పగా చెప్పుకున్నాడు. దీంతో అతడు కూడా బాధితురాలిని బెదిరింపులకు గురిచేశాడు. దీంతో చేసేది లేక బాధిత మహిళ భర్తను జరిగిందంతా చెప్పింది. ఆపై భర్తతోనే కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్జికల్స్ స్ట్రైక్స్‌పై డిజిఎంఓ ప్రకటన చేసినా నమ్మవా? కేజ్రీవాల్ ఏంటిది?: అన్నా హజారే