Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీ అంటే జగన్ కు భయం: జేసీ సంచలన వ్యాఖ్యలు

Advertiesment
Jagan
, సోమవారం, 1 జూన్ 2020 (12:37 IST)
"మోడీ అంటే జగన్ కు భయం. అందుకే ఆయన మాట మాత్రమే వింటాడు. ఆయన ఏమైనా జగన్‌‌ను చేస్తాడేమో అనే భయం. ఇంకెవ్వరి మాటా వినడు" అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... "రాజకీయాల్లో నాటికి నేటికి చాలా మార్పులు వచ్చాయి. బస్సుల జాతీయం చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి న్యాయస్థానం సలహా ఇచ్చినా వెంటనే రాజీనామా చేశారు.

151 మంది మెజార్టీ వచ్చినా రాజ్యాంగ బద్దంగా రాష్ట్రాన్ని పరిపాలించాలి. నేనే రాజు నేను తప్ప ఎవ్వడు లేడు అనే పద్దతి ఉంది. రాష్ట్ర ప్రజలు ఏమి మాట్లాడుకుంటున్నారో ముఖ్యమంత్రి చూడాలి. ప్రజలను కన్వెన్స్ చేయాలి. అమరావతి రాజధాని కోసం అన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉంది. ముఖ్యమంత్రి పోలేకపోతే ఆయన సన్నిహితులు వెళ్లాలి. జగన్ పాలన చదువుకున్న వాళ్లకు అర్థం అయ్యింది. కాయా కష్టం చేసుకున్న వాళ్లకు ఇంకా అర్థం కాలేదు" అని జేసీ విమర్శల వర్షం కురిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిడతల ముప్పు.. ఎలా?