Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాచకురాలికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

Advertiesment
Hyderabad
, ఆదివారం, 22 డిశెంబరు 2019 (09:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ యాచకురాలిపై అత్యాచారం జరిగింది. తమవంతు సాయం చేసి ఆదుకోవాల్సిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్కాజిగిరికి చెందిన చిన్నప్ప(50), నేనావత్‌ విజయ్‌ కుమార్‌(53) అనే ఇద్దరు వ్యక్తులు ఈ నెల 17వ తేదీ అర్థరాత్రి పూటుగా మద్యం సేవించారు. ఆ తర్వాత రోడ్డు పక్కన కూర్చున్న యాచకురాలితో మాటలు కలిపి తమ ఇంటికి తీసుకెళ్లి ఆమెకు కూడా మద్యం తాగించారు. 
 
దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, పోలీసులకు ఫోన్‌ చేశారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని శుక్రవారం మిర్జాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండ్‌తో కలిసి ఇంటికెళ్లిన విద్యార్థిని.. మార్గమధ్యంలో గ్యాంగ్ రేప్...