Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

Godavari
, శుక్రవారం, 21 జులై 2023 (11:38 IST)
గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
 
గోదావరి నదికి భారీగా ఇన్ ఫ్లో వస్తున్నందున భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో తొలి హెచ్చరిక జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే అప్‌స్ట్రీమ్ వద్ద 31.560 అడుగులు, దిగువ స్పిల్‌వే వద్ద 22.900 అడుగులు, అప్పర్ కాఫర్‌డ్యామ్ వద్ద 32.200, డీసీడీ వద్ద 22.340 అడుగుల నీటిమట్టం ఉంది. 
 
పోలవరం ప్రాజెక్టు నుంచి 5,20,191 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రికి ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
వరద పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాలలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాలను గుర్తించాలని కోరారు. 
 
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. పునరావాస కేంద్రాల్లో తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 
 
పునరావాస కేంద్రాలు 24 గంటలూ పని చేయాలని, పాము కాటుకు చికిత్స చేసేందుకు యాంటీ-వెనమ్‌తో సహా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వారికి సూచించారు.
 
బోట్లు, నిష్ణాతులైన ఈతగాళ్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని మత్స్యశాఖ డీడీని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు నిత్యావసర సరుకులను తరలించేందుకు మినీ లారీలను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు.
 
వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలు సక్రమంగా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. కాగా, కలెక్టరేట్‌లో 1800 233 1077 నంబర్‌తో సెంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు.
 
కుకునూరు మండలం దాచారం గ్రామానికి వెళ్లే రహదారి గుడేటి వాగు వరద నీటితో నిండిపోవడంతో రోడ్డు కనెక్టివిటీ నిలిచిపోయింది. గోదావరి వరద నీటిలో రోడ్లు జలమయం కావడంతో బెస్తగూడెం, నెమలిపేట్, రామన్నగూడెంలకు రోడ్డు కనెక్టివిటీ కూడా తెగిపోయింది. కుక్కునూరు మండలంలోని పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో అధికారులు గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ రైతులకు శుభవార్త.. అకౌంట్‌లోకి రూ.24వేలు