Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసాధారణ తీవ్ర తుఫాను - వచ్చే 12 గంటల్లో అతితీవ్ర రూపం

cyclone
, ఆదివారం, 11 జూన్ 2023 (08:56 IST)
అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన తీవ్ర తుఫాను 'బిపోర్‌ జాయ్‌' మరో 12 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి అసాధారణ అతి తీవ్ర తుఫానుగా మారనుందని శనివారం భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది 24 గంటల్లో ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది. 
 
వాతావరణశాఖ వివరాల ప్రకారం.. వచ్చే 3 రోజుల్లో ఉత్తర - ఉత్తర - పశ్చిమ దిశగా తుఫాను కదులుతుంది. ప్రస్తుతం అది గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. పోర్‌బందర్‌కు 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుంది. 
 
ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఈ తుఫాను గుజరాత్‌ను తాకకపోవచ్చని, కానీ, రానున్న 5 రోజుల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. వచ్చే 5 రోజులూ అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. 
 
తుఫాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడతాయి. బలమైన ఈదురు గాలులూ వీస్తాయి. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్‌ బీచ్‌ను ఈ నెల 14 వరకూ మూసివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. 
 
తఫానను కారణంగా సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల్లో 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. పోర్‌బందర్‌, గిర్‌, సోమనాథ్‌, వల్సాద్‌లకు జాతీయ విపత్తు దళ బృందాలను అధికారులు పంపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు