Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ్మోహన్ రావును జయకు పరిచయం చేసింది రోశయ్యా? ఐటీ అడుగుతుందా?

తితిదే మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి టు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వరకూ ఐటీ శాఖ సోదాలు అరెస్టుల పరంపర సాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్టు రాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అదేంటయా అంటే.... రామ్మోహన్ రావును తొలుత జయలలితకు పరిచయం చేస

Advertiesment
Chennai IT Raids
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:28 IST)
తితిదే మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి టు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వరకూ ఐటీ శాఖ సోదాలు అరెస్టుల పరంపర సాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్టు రాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అదేంటయా అంటే.... రామ్మోహన్ రావును తొలుత జయలలితకు పరిచయం చేసింది తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
 
రామ్మోహన రావును జయకు పరిచయం చేసిన తర్వాత మొదట్లో ఆయన్ను జయ వ్యక్తిగత కార్యదర్శిగా నియమించారనీ, ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో అవినీతి మరకలు అంటుకున్న రామ్మోహన్ రావు కేసు విషయంలో మాజీ గవర్నర్ రోశయ్యను కూడా ఐటీ శాఖ కొంత సమాచారం మేరకు విచారించే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే మరో దుమారం చెలరేగడం ఖాయం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ జీవించి వుంటే ఇంత దమ్ము ఉండేదా? ఇప్పటికీ నేనే సీఎస్ : రామ్మోహన్ రావు గర్జన