Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Advertiesment
express rail

సెల్వి

, శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:44 IST)
విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన కీలక హామీలలో ఒకదాన్ని నెరవేర్చడంలో కీలకంగా మారనుంది. 
 
ఈ నిర్ణయంలో భాగంగా, ప్రస్తుతం ఉన్న వాల్టెయిర్ రైల్వే డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా పేరు మార్చనున్నారు. అదనంగా, కొత్త రాయగడ రైల్వే డివిజన్‌ను సృష్టించి తూర్పు కోస్ట్ రైల్వే జోన్ కింద ఉంచుతారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.
 
స్కిల్ ఇండియా చొరవ కోసం రూ.8,800 కోట్లు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కోసం రూ.6,000 కోట్ల, జన్ శిక్షాన్ సంస్థాన్ కార్యక్రమానికి రూ.858 కోట్ల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆయన ప్రకటించారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఆమోదం ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చినట్లు అవుతుందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల నందకం గెస్ట్ హౌసులో దంపతులు ఆత్మహత్య