Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

Advertiesment
lady aghori nagasadhu

ఠాగూర్

, గురువారం, 24 ఏప్రియల్ 2025 (10:34 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ నాగసాధును హైదరాబాద్ మోకిలా పోలీసులు మోసం కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత చేవెళ్ల కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే, అఘోరీకి సంగారెడ్డి జిల్లా జైలు అధికారులు తేరుకోలేని షాకిచ్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో అఘోరీని సంగారెడడి జిల్లా కంది సబ్ జైలుకు పోలీసులు తరలించగా, ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్‌‌లోనూ ఉంచలేమని జైలు అధికారులు తేల్చి చెప్పారు. 
 
పైగా, అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌కు లింగ నిర్ధారణ జరిగితేగానీ ఇక్కడ ఉంచుకోలేమని అఘోరీని జైలు అధికారులు తిరిగి పంపించి వేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకు వైద్యులు వైద్య పరీక్షలు అనంతరం నింగ నిర్ధారణ చేయనున్నారు. అయితే, ట్రాన్స్ జెండర్లకు చంచల్ గూడా జైలులో ప్రత్యేక బ్యారక్ వసతి ఉండటంతో అధికారులు అక్కడకు తరలించారు. 
 
కాగా, ప్రత్యేక పూజల పేరుతో తన వద్ద రూ.9.80 లక్షలు వసూలు చేసి అఘోరీ మోసం చేసినట్టు రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఉండే మహిళ ఫిబ్రవరి నెలలో మోకిలా పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే ఏపీకి చెందిన యువతి వర్షిణిని అఘోరి శ్రీనివాస్ పెళ్ళి చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అఘోరీని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత సాంకేతిక ఆధారాలతో అఘోరీని ఆచూకీని గుర్తించి, హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్