Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్లాప్ పేరుతో చెత్త పన్ను వసూలు చేసిన వైకాపా ప్రభుత్వం.. రద్దు చేసిన టీడీపీ సర్కారు!

clap

వరుణ్

, ఆదివారం, 16 జూన్ 2024 (10:38 IST)
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరుతో గత వైకాపా ప్రభుత్వం వసూలు చేసిన చెత్త పన్నును వసూలు చేసింది. మురికివాడల్లో ఒక్కో ఇంటికి రూ.60 వేలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.120 చొప్పున వసూలు చేసింది. అయితే, ముగిసిన ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో టీడీపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ఈ చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాకామంత్రి పి.నారాయణ వెల్లడించారు. 
 
వైకాపా ప్రభుత్వం హయాంలో మున్సిపల్ శాఖలో కీలకంగా పని చేసిన ఓ మహిళా అధికారి ఆలోచనలతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో క్లాప్ పేరుతో చెత్త సేకరణ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన టెండర్‌ను ఓ కాంట్రాక్టర్‌ సంపాదించుకున్నాడు. ఈ విషయంలోనూ ఆ మహిళా అధికారి కీలకంగా వ్యవహరించారు. 
 
చెత్తపన్నులో భాగంగా, మురికివాడల్లో ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ.60, మిగిలిన ప్రాంతాల్లో రూ.120 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించి, ఆ విధంగా వసూలు చేశారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు దానిని రద్దు చేసింది. అయితే, దీంతో క్లీన్ ఆంధ్రా (క్లాప్) పథకం కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి - సురక్షితంగా తొలగించిన వైద్యులు