థియేటర్లలో కూలబడిపోయిన లైగర్

లైగర్ చిత్రం థియేటర్లలోకి రాగానే చతికిలపడిపోయింది. ప్రమోషన్ సమయంలో ఎంతగా ఊపు ఇచ్చిందో తెరపైకి రాగానే అంతగా కూలబడిపోయింది.

social Media

విజయ్ దేవరకొండ- అనన్యపాండే జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్టుతో తెరకెక్కింది.

లైగర్ దెబ్బకి డిస్ట్రిబ్యూటర్లు బెంబేలు

వసూళ్ల విషయంలో ఘోరంగా విఫలమైంది. డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు తెచ్చినట్లు టాక్ వినబడుతోంది.

చిత్రం ఫ్లాప్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చార్మిని టార్గెట్ చేసారు.

ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది పూరీయా లేక చార్మీయా అంటూ ఎగతాళి చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కండలు చూసి సినిమా చూస్తారనుకున్నారేమో అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఈ ట్రోల్స్ వల్లనో ఏమోగానీ నటి చార్మి కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది.

కాస్త బ్రేక్ తీసుకుని బిగ్ బ్యాంగ్‌తో తిరిగి వస్తాను అంటూ పోస్ట్ పెట్టింది. అప్పటివరకూ మమ్మల్ని బ్రతకనివ్వండి అంటూ ట్వీట్ చేసింది.

social Media

నిజమే, సినిమా హిట్ అయితే ఊరేగింపులు, దేవాలయాల సందర్శనలు వుంటాయి, ప్లాప్ అయితే బయట ప్రపంచంలోకి రావాలంటేనే ఇబ్బందిగా మారుతుంది.

social Media

'ప్రేమమ్‌' ఫేమ్ గ్లామర్ కెరటం మడోన్నా సెబాస్టియన్ ట్రెడిషనల్ లుక్

Follow Us on :-