కడుపు నొప్పి వివిధ కారణాల వల్ల రావచ్చు. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు తినడం వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది. అలాంటి ఆహారాలకు దూరంగా వుండాలి. ఆ ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media
కడుపు నొప్పి జీర్ణ రుగ్మతలు, శరీరంలో వేడి వంటి అనేక కారణాల వలన సంభవించవచ్చు.
కడుపు నొప్పి సమయంలో బిర్యానీ వంటి మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి.
తీపి, పాయసం మొదలైన వాటికి దూరంగా ఉండటం మంచిది.
నూనెతో బాగా వేయించిన ఆహారాలు కడుపు నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి.
జీర్ణక్రియ లోపం వల్ల కడుపునొప్పి వస్తే, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే నిమ్మరసం తీసుకోవచ్చు.
గోరువెచ్చని మంచినీటిని తాగడం వల్ల కడుపు నొప్పి నుండి తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.