Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మోహన్ ఫైర్.. బాబు ఎందుకు భిక్షం వేసినట్లు?
, శనివారం, 2 మార్చి 2019 (13:20 IST)
2014 నుంచి విద్యానికేతన్‌ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరిగి అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని మోహన్‌బాబు ప్రశ్నించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడటంలేదని మోహన్‌బాబు స్పష్టం చేశారు. 
 
విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంపై.. ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించడం లేదని మోహన్ బాబు తెలిపారు. మూడు నెలలకు ఓసారి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తామని మోహన్ బాబు చెప్పారు. కానీ ఇప్పటివరకూ బకాయిలు చెల్లించలేదు. భిక్షం వేసినట్లు కొద్దిగా ఇస్తున్నారు. ఇలాగైతే విద్యార్థులు ఎలా చదవాలి. అధ్యాపకులకు జీతాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. 
 
దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతకాలం ఇలా అంటూ అడిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే.. ఆందోళన తప్పదని హెచ్చరించారు. తమ విద్యాసంస్థల్లో ర్యాంగింగ్ లేదని.. తాను రాజకీయం కోసం కాదు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి మాట్లాడుతున్నానని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రగిలిపోతున్న పాకిస్థాన్.. సరుకుల్లో విష ప్రయోగం.. జాగ్రత్త అవసరం..