Publish Date: Sun, 11 Aug 2019 (23:17 IST)
Updated Date: Sun, 11 Aug 2019 (23:23 IST)
భారత ప్రధాని మోడీపై ఆధ్యాత్మిక గురువు చిన జియర్ స్వామిజీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎంతోమంది ప్రధాని లను చూశానని కానీ ఇటువంటి దమ్మున్న ప్రధానిని మాత్రం చూడలేదన్నారు చినజీయర్.72 సంవత్సరాలుగా ఎవరూ చేయలేని పనిని మోడీ చేసి చూపారని కితాబు ఇచ్చారు.
కాశ్మీర్ లో ఆర్టికల్ 370ను రద్దు చేసి మోడీ అద్భుతం చేశారని అన్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని పదవి చేపట్టిన వారు కూడా ఈ సాహసం చేయలేదని మోడీ దమ్మున్న వాడు కావడం మూలంగా ఈ పని చేయగలిగాడన్నారు.
72 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో నేడు భరత మాత ముఖం మీద శాంత రసం, ప్రశాతం రసం, ఆనంద రసం కనపడుతున్నాయని తమ ఆనందాన్నివ్యక్తం చేశారు చినజియర్ స్వామి. మోడీ తీసుకున్న ఈ నిర్ణయానికి చైనా, అమెరికా దేశాలు మౌనంగా ఉండిపోయారన్నారు.ఇక పాకిస్తాన్ అయితే మోడీతో పెట్టుకుంటే మనల్ని కూడా ఆక్రమించేస్తాడని భయపడుతున్నారని అన్నారు.
శ్రీ
Publish Date: Sun, 11 Aug 2019 (23:17 IST)
Updated Date: Sun, 11 Aug 2019 (23:23 IST)