Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా హిజ్రా.. పేరు అప్సరా రెడ్డి

Advertiesment
Apsara Reddy
, గురువారం, 10 జనవరి 2019 (10:04 IST)
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఓ హిజ్రాను (ట్రాన్స్‌జెండర్)ను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఆమె పేరు అప్సరా రెడ్డి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈమె.. గతంలో అన్నాడీఎంకేకి అధికార ప్రతినిధిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలో చేరింది. అక్కడ నుంచి ఇపుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమెను పార్టీలో చేర్చుకున్న రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 
 
133 యేళ్ళ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఓ హిజ్రాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ఇదేతొలిసారి. జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పని చేసిన అప్సరారెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏఐఎంసీ అధ్యక్షురాలు, ఎంపీ సుస్మితాదేవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నియమించారు. బాలలపై లైంగిక దాడులు, తదితర సామాజిక అంశాలపై అప్సరారెడ్డి కృషి చేస్తున్నారు. 
 
భారత జాతీయ కాంగ్రెస్ కుటుంబంలో అప్సరారెడ్డిని సభ్యురాలిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అప్సరారెడ్డి స్పందిస్తూ అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ.. మహిళల అభ్యన్నతి కోసం, వారి హక్కుల సాధనకు కృషి చేస్తానన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత సాధించడం కోసం వివిధ రాష్ట్రాల్లోని మహిళా కాంగ్రెస్ శాఖల అధ్యక్షురాళ్లతో కలిసి పని చేస్తానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కారు కొండల్లో నడుస్తుంది.. ఇంటి మెట్లు ఎక్కుతుంది...