Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సింహంలా బతికిన నేనూ కొజ్జాలా పరుగెత్తా : జేసీ దివాకర్ రెడ్డి

సింహంలా బతికిన నేను కొజ్జాలా పరుగెత్తాల్సి వచ్చిందంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డివ్యాఖ్యానించారు. తమ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, తమను కించపరిచేలా మాట్లాడితే నాలుక

Advertiesment
Anantapur
, శనివారం, 22 సెప్టెంబరు 2018 (09:23 IST)
సింహంలా బతికిన నేను కొజ్జాలా పరుగెత్తాల్సి వచ్చిందంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డివ్యాఖ్యానించారు. తమ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా, తమను కించపరిచేలా మాట్లాడితే నాలుకలు తెగ్గోస్తామంటూ అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, కదిరి సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ గోరంట్ల మాధవ్‌ చేసిన వ్యాఖ్యలపై జేసీ దివాకర్ ఘాటుగానే స్పందించారు.
 
ఇదే అంశంపై జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఓయ్‌ మాధవ్‌... నన్నే హెచ్చరించే మగాడివా! నా నాలుక కోస్తావా! సినిమాల్లోలాగా మీసం తిప్పితే మగాడివైపోతావా! నువ్వు ఖాకీ విడిచి రా, నేను ఖద్దరు విడిచి వస్తా! నాలుక ఎక్కడ కోస్తావో చెప్పు... అక్కడికే వస్తా అంటూ సవాల్ విసిరారు. 
 
'నా చుట్టూ తిరిగే వాడివి.... నన్నే బెదిరిస్తావా! కొజ్జాలకూ, ఆడామగా కానోళ్లకూ మీసాలుంటాయి. నీకు దమ్మూ ధైర్యం ఉంటే... రా చూసుకుందాం' అంటూ వ్యాఖ్యానించారు. పైగా, తాను ఏ ఒక్కర్నీ ఉద్దేశించి కొజ్జా అనలేదన్నారు. అలా అనుకుని ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. 
 
'చిన్నపొడమల ఘటనలో ప్రబోధానంద స్వామి భక్తులు తరిమితరిమి కొట్టారు. పోలీసులు నెత్తిపైన పెద్ద కిరీటాలూ... బుల్లెట్‌ ప్రూఫ్‌ కవచాలు... చేతిలో లాఠీలు... పెద్దపెద్ద గన్నులు ఉన్నా కొజ్జాల్లా పరిగెత్తారు. 45 ఏళ్లు రాజకీయాల్లో సింహంలా బతికిన నేనూ కొజ్జాలా పరిగెత్తాల్సి వచ్చింది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగినపుడు 200 మంది పోలీసులున్నారు.. వారికూడా పారిపోతే వారిని ఏమనాలో మీరే చెప్పండి అంటూ మీడియాను జేసీ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు- ఆమ్రపాలికి కొత్త బాధ్యతలు