Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుశాంత్ ఆత్మహత్య.. రియా అక్కడే వున్నదట.. డ్రాప్ కూడా చేశాడట!

Advertiesment
Sushant singh rajput
, శనివారం, 3 అక్టోబరు 2020 (12:39 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో రోజు రోజుకీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ అనుమానాస్పద మృతి తరువాత రియా డ్రగ్స్ బాగోతం బయటికి రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఈ కోణంలో విచారణ చేపట్టింది. సుశాంత్ మరణానికి ముందు అతని ఇంట్లో పార్టీ జరిగినట్టు ఓ జాతీయ మీడియా సంచలన విషయాల్ని బయటపెట్టింది.
 
లాక్‌డౌన్ సమయంలో సుశాంత్‌తో కలిసి రియా వుందన్న విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. జూన్ 8న తాను సుశాంత్ ఇంటి నుంచి వెళ్లిపోయానని గతంలో తెలిపింది. కానీ ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రియా జూన్ 13న అంటే సుశాంత్ మృతి చెందిన రోజు వరకు అక్కడే వుందని, సుశాంత్ స్వయంగా రాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో అర్థరాత్రి ఆమెని డ్రాప్ చేశాడని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో రియా కావాలనే అబద్ధం చెబుతోందని తేలిపోయింది. దీంతో సీబీఐ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
 
అంతే కాకుండా సుశంత్ మృతి కేసులో సిద్ధార్ధ్ పితానీని కూడా సీబీఐ మరోసారి విచారణకు పిలవబోతోందట. సుశాంత్ మృతి చెందిన రోజు సిద్ధార్ధ్ పితాని ఇంట్లోనే వున్నారట. ఆ కారణంగా అతన్ని ప్రత్యక్ష సాక్షిగా పరిగణించి మరో సారి అతన్ని విచారించబోతున్నట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్క నిశ్శబ్దం చూసిన ప్రేక్షకులు నిశ్శబ్దం, కదిలించినా మాట్లాడటంలేదట, ఎందుకని?