Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభిమాని కుటుంబానికి అండ‌గా నిల‌బడ్డ‌ హీరో సందీప్ కిష‌న్

Advertiesment
Sundeep Kishan
, శుక్రవారం, 18 జనవరి 2019 (18:00 IST)
అభిమానానికి ఎల్ల‌లు ఉండ‌వు. అందుక‌నే హీరోలు అభిమానుల ప‌ట్ల ఆద‌ర‌ణ‌ను చూపుతూనే ఉంటారు. యువ క‌థానాయ‌కుడు సందీప్‌ కిష‌న్ తొలి చిత్రం `ప్ర‌స్థానం` నుండి అభిమాని అయిన క‌డ‌ప శ్రీను ఈరోజు ప్రొద్దుటూరులో గుండెపోటుతో క‌న్నుమూశారు. ఈ విష‌యం తెలుసుకున్న సందీప్ కిష‌న్ క‌డ‌ప శ్రీను ద‌హ‌న సంస్కారాల‌కయ్యే డ‌బ్బులు ఇచ్చారు. 
 
అంతేకాకుండా ఆయ‌న త‌ల్లికి నెల‌కు ఏడు వేల రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని అందించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. ``నాకు అన్ని సంద‌ర్భాల్లో అండ‌గా నిల‌బడ్బ నా అభిమాని, నా తొలి అభిమానిని కోల్పోవ‌డం బాధాక‌రం. చిన్న వ‌య‌సులోనే నా సోద‌రుడు దూరం కావ‌డం బాధాక‌రం. నీ కుటుంబానికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను శ్రీను. నీ కుటుంబ బాధ్య‌త నాది. ల‌వ్ యు శ్రీను.. నీ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి`` అంటూ హీరో సందీప్ కిష‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా సంతాపాన్ని ప్ర‌క‌టించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్లీజ్... 'మహానాయకుడు'ని ఉచితంగా ఇవ్వండి... లేదంటే ఆరిపోతాం... ఎవరు?