Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలేషియా టూర్‌కు వైరముత్తు కంపెనీగా రమ్మన్నారు : గాయని భువన

Advertiesment
Bhuvana Seshan
, మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:10 IST)
మీటూ ఉద్యమ ఫలితామని తమిళ సినీ కవి వైరముత్తు బండారం బయటపడుతోంది. నిన్నటికి నిన్న వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలు చేసింది. ఇవి కోలీవుడ్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో గాయని భువన శేషన్.. వైరముత్తుపై ఆరోపణలు చేశారు.
 
మలేషియా టూర్‌కు తనకు కంపెనీ ఇవ్వాలని వైరముత్తు అడిగారని, లేదంటే తన కెరీర్‌ని నాశనం చేస్తానని బెదిరించారని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. వైరముత్తుకు వ్యతిరేకంగా గాయని చిన్మయి మొదలుపెట్టిన ఈ ఉద్యమం ద్వారా ఇప్పటికే పదిమందికిపైగా మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టిన విషయం తెల్సిందే. 
 
దీంతో వైరముత్తుకు మద్దతు ఇస్తూ వచ్చిన వారంతా ఇపుడు వివాదానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో వైరముత్తుపై ప్రతి రోజూ వచ్చే ఆరోపణలు పెరుగుతుండటంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురవుతోంది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చ‌ర‌ణ్ - బోయ‌పాటి మూవీ సంక్రాంతికి వ‌స్తుందా..?