Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్గిల్ విజయ్ దివస్: హీరోలకు సెల్యూట్ చేద్దామంటూ సమంత ట్వీట్.. చేనేత చీర కట్టుకుని?

పాకిస్థాన్‌తో మే-1999 నుంచి జూలై-1999 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసింది. ఈ నేపథ్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన నేషనల్ హ

Advertiesment
Samantha Ruth Prabhu
, గురువారం, 27 జులై 2017 (11:30 IST)
పాకిస్థాన్‌తో మే-1999 నుంచి జూలై-1999 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసింది. ఈ నేపథ్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన నేషనల్ హీరోస్‌కు శాల్యూట్ చేద్దామంటూ ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున కాబోయే కోడలు సమంత పేర్కొంది. బుధవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. నాడు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన భారత ఆర్మీ, త్రివర్ణ పతాకంతో పాటు రూపొందించిన ఓ పోస్టర్‌ను సమంత పోస్ట్ చేసింది. ‘కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లకు ప్రణామాలు చేస్తున్నట్లు సమంత పేర్కొంది. 
 
మరోవైపు తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. రెండు రోజుల క్రితం సమంత ట్విట్టర్‌లో తన తల్లి చీర కట్టుకుని దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ చేనేతపై యువతులకు పోటీ పెట్టి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. యువతులు తమ తల్లి ధరించే చేనేత చీరను ఫ్యాషన్‌బుల్‌గా కట్టుకుని ఫొటో దిగి దానికి రివైవ్ హ్యాండ్‌లూమ్, వోవెన్ 2017 అనే పదాలను హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలని సూచించింది.
 
ఈ ఫోటోల్లో ఐదుగురిని సెలెక్ట్ చేసి వోవెన్ ఫ్యాషన్ షోకు ఆహ్వానించనున్నట్లు పేర్కొంది. సమంత ట్వీట్ యువతులు పెద్ద ఎత్తున చేనేత చీరలను కట్టుకుని.. ఆ ఫోటోలను పోస్టు చేస్తున్నారు.

webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలితో పోటీపడే స్పైడర్ బిజినెస్: మొత్తం రైట్స్ రూ.200 కోట్లు పలికిందా?