Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'హే క్రిష్.. నిన్ను చూస్తే నాకు అసూయ'గా ఉంది : రాంగోపాల్ వర్మ

నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, అందరిపైనా ట్వీట్ల విమర్శలు గుప్పించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపా

'హే క్రిష్.. నిన్ను చూస్తే నాకు అసూయ'గా ఉంది : రాంగోపాల్ వర్మ
, సోమవారం, 9 జనవరి 2017 (05:23 IST)
నందమూరి బాలకృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, అందరిపైనా ట్వీట్ల విమర్శలు గుప్పించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇపుడు 'గౌతమిపుత్ర' దర్శకుడు క్రిష్‌ను వదిలిపెట్టలేదు. తాజాగా ఆయన క్రిష్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. 
 
ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ ముంబైలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చూసిందని, జాతీయ, అంతర్జాతీయ హక్కులు కొంటోందని చెప్పిన వర్మ తర్వాత ట్వీట్‌లను కొనసాగించాడు. ముంబైలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' సింగిల్ షోతో క్రిష్ నాలుగు కంపెనీలతో సంతకం చేశాడని వెల్లడించడమే కాక.. ‘హే క్రిష్.. నాకు అసూయ’గా ఉందని వ్యాఖ్యానించాడు. ‘ఈ నాలుగు కంపెనీల్లో ఒకటి ‘ఏకే’ అని నాకు తెలుసు.. రెండోది ‘ఎస్‌కే’ అని విన్నాను. కన్‌ఫర్మ్ చేయవా’ అంటూ ట్వీట్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పురుషుడిగా పుట్టినందుకు సిగ్గుగా ఉంది: నటుడు సిద్ధార్థ్