Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు చిత్రపరిశ్రమను శాసిస్తున్న డబ్బు : పోసాని కృష్ణమురళి

posani krishnamurali
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (18:27 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యేటా సినీ నటులకు ఇచ్చే నంది అవార్డులపై సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది పురస్కారాలపై అనేక అపోహలు, ఉన్నాయన్నారు. గ్రూపులు, కులాల వారీగా పంచుకునేవారని ఆరోపించారు. ముఖ్యంగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ అవార్డుల పంపకాలు జరిగేవని విమర్శించారు. 
 
గతంలో తనకు టెంపర్ చిత్రంలో నటనకు గాను ఖర్మకాలి నంది అవార్డు ఇచ్చారన్నారు. తప్పక ఇవ్వని పరిస్థితుల్లో వేరే దారిలేక తనకు ఇచ్చారని చెప్పారు. తాను కూడా వెళ్లి ఆ అవార్డును స్వీకరించానని చెప్పారు. అసలు ఎవరెవరికి ఏయే అవార్డులు ఇచ్చారో చూశా. అపుడు అవార్డుల కమిటీలో 11 మంది ఒకే వర్గం వారే ఉన్నారు. 
 
దీంతో అవార్డులు ఇచ్చిన తీరు చూసి తనకు నచ్చక ఇచ్చిన అవార్డును సైతం వద్దని చెప్పినట్టు వెల్లడించారు. అవార్డులు అనేవి కులాలు, మతాలకు సంబంధం లేకుండా ఇవ్వాలన్నారు. తెలుగు చిత్రపరిశ్రమను శాసించేది కులాలు మతాలు కాదని, డబ్బు ఒక్కటే అని పోసాని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపిలో ప్రజల వద్దకు సినిమా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి లక్ష్యం : గౌతమ్‌ రెడ్డి