Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోలీవుడ్ సినీ నిర్మాతలను టార్గెట్ చేసిన ఆదాయపన్ను శాఖ

prabhu - thanu
, మంగళవారం, 2 ఆగస్టు 2022 (12:01 IST)
తమిళ చిత్రంలోని పలువురు బడా నిర్మాతలను ఆదాయపన్ను శాఖ టార్గెట్ చేసింది. ప్రముఖ పైనాన్షియర్ అన్బుచెళిన్, బడా నిర్మాత కలైపులి ఎస్.థాను, డ్రీమ్ వారియర్ పిక్సస్ అధినేతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా తదితలు ఇళ్లు కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తుంది. 
 
ముఖ్యంగా మదురైకి చెందిన ప్రముఖ బడా ఫైనాన్షియర్ అన్బుచెళియన్ సినిమా ఫైనాన్షియర్. గోపురం సినిమాస్ అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఈయన అనేక చిత్రాలకు ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ కేసులో ఈరోజు (ఆగస్టు 2) ఉదయం నుంచి మదురై, చెన్నైలోని ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు అన్బుచెళియన్‌కు చెందిన 40కి పైగా చోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. 
 
అలాగే, నిర్మాతలు ఎస్.థాను, ఎస్.ఆర్.ప్రభు ఇళ్లపైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. త్యాగరాయనగర్ ప్రకాశం రోడ్డులోని థాను కార్యాలయంపై కూడా దాడి చేశారు. మరికొంత మంది తయారీదారులు కూడా అధికారుల పరిశీలన జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక్కసారిగా కోలీవుడ్ నిర్మాతలపై పడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైష్ణ‌వ్ తేజ్ రంగ రంగ వైభవంగాకు దేవీశ్రీ‌ప్ర‌సాద్ బాణీలు