Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"అన్ స్టాటపబుల్ బాలయ్య" షోకు "పుష్ప"రాజ్

Advertiesment
Allu Arjun
, మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:48 IST)
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్‌లు మరోమారు ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రైవేట్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో బాలకృష్ణ "అన్ స్టాపబుల్ బాలయ్య" అనే షోను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరుకానున్నారు. 
 
ఈ షోలో ఇప్పటికే మోహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి తదితరులు వచ్చి సందడి చేశారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేనిలు కూడా హాజరై ఆటపట్టించారు. వీరిద్దరికి సంబంధించిన షో ఈ నెల 24వ తేదీన టెలికాస్ట్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో "అఖండ" చిత్రంతో బాలయ్య, "పుష్ప" చిత్రంతో అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టారు. ఇపుడు వీరిద్దరూ కలిసి ఒకే వేదికను షేర్ చేసుకోనున్నారు. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే "అఖండ" ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నందమూరి అభిమానులు ఖుషీ చేసిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెనక్కి తగ్గిన 'భీమ్లా నాయక్'! .. శివరాత్రికి రిలీజ్?