Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాదాద్రి జిల్లాలో ఘోరం... ప్రేమించలేదని యువతిని పొడిచి చంపిన ప్రేమోన్మాది

ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను సమీప భువనగిరి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. వివరాల్లోకి వెళితే...

Advertiesment
lover
, శనివారం, 10 జూన్ 2017 (17:38 IST)
ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను సమీప భువనగిరి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. వివరాల్లోకి వెళితే... యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి డిగ్రీ చదువుతోంది. 
 
ఈమె కళాశాలకు వెళ్లే సమయంలో శ్రీకాంత్ అనే యువకుడు తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. గత 6 నెలలుగా ఈ వేధింపులు సాగుతుండగా ఈమధ్యనే గాయత్రి తల్లిదండ్రులు అతడికి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కుమార్తె గాయత్రికి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కూడా కుదిరింది. మరో 10 రోజుల్లో నిశ్చితార్థం. 
 
విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తలుపు వేసి వున్నా బద్ధలుకొట్టి లోనికి ప్రవేశించాడు. తలుపు చప్పుడు విని విద్యార్థిని సోదరుడు వచ్చేలోపుగానే ఆమెను విచక్షణరహితంగా పొడిచాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగానే నేరుగా కత్తితో సహా భువనగిరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా పెళ్లిపీటలెక్కాల్సిన తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని గాయత్రి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారంపై ఆశ.. కుమార్తెను చంపి కళ్ళెదుటే అత్యాచారం.. గుడ్లప్పగించి చూసిన తల్లిదండ్రులు...