Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బర్రెపై అఘాయిత్యం : అమానుష చర్యకు పాల్పడిన వ్యక్తికి చావుదెబ్బలు

బర్రెపై అఘాయిత్యం : అమానుష చర్యకు పాల్పడిన వ్యక్తికి చావుదెబ్బలు
, ఆదివారం, 15 ఆగస్టు 2021 (12:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో ఓ వ్యక్తి అమానుష చర్యకు పాల్పడ్డాడు. ఓ వ్యక్తి బర్రెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ చర్యను గమనించిన కొందరు ఆ వ్యక్తిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. అయినా బుద్ధి మార్చుకోని అతడు మళ్లీ అదే పని చేశాడు. 
 
ఈసారి ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించి అక్కడ కట్టేసివున్న బర్రెపై అత్యాచారం చేస్తుండగా దాని తోక మెడకు చుట్టుకుంది. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. వనపర్తి జిల్లా కేంద్రం నాగవరంలో శనివారం ఈ ఘటన జరిగింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులు. అతడు కూలీ పనికి వెళుతుండటాడు. నాగవరం బాల్‌రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఓ గేదె తోక మెడ కు బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులును గమనించారు. 
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగానే దానితోక మెడకు చుట్టుకొని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదుపులోకి రాని కరోనా - ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడగింపు