Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ఇక జూనియర్ కళాశాలలుగా కస్తూర్బా విద్యాలయాలు

Advertiesment
Kasturba schools
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:46 IST)
తెలంగాణలోని కొన్ని  కస్తూర్బా విద్యాలయాలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 36 కస్తూర్బా విద్యాలయాలల్లో ఈ సంవత్సరం నుంచే ఇంటర్ మీడియేట్ తరగతులను ప్రారంభించాలని ఆదేశించింది.

ఈ కళాశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో విద్యా బోధన జరుగుతుంది. 2021 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, 2022 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.

బూర్గుం పహాడ్, పలిమెల, మహాముత్తారం, మొగుళ్లపల్లి, రేగొండ, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, మహేశ్వరం, కొందుర్గు, సిద్దిపేట అర్బన్, సిర్పూర్ -టీ, మాణిక్యాపూర్, గండీడ్, మహమ్మదాబాద్ లోని కస్తూర్బా విద్యాలయాల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది.

భద్రాచలం, టేకుమట్ల, బీబీపేట, ఆదిలాబాద్ అర్బన్, భీంపూర్, చింతల మానేపల్లి, కెరెమెరి, రెబ్బెన, సిర్పూర్- యూ, జైపూర్, గంగారం, రఘునాధ పాలెం, నర్సాపూర్ -జీ,  సిరిసిల్ల, అంతర్గాం, పెంట్లపల్లి, శెట్టిపాలెం, మద్దిరాల, కృష్ణ, ఐనవోలు,  భీంపూర్, అమరచింత,  అడ్డగూడూర్‌లోని కస్తూర్బా విద్యాలయాల్లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు ప్రారంభం అవుతాయి. ప్రతి కోర్సులో 40 సీట్లు ఉంటాయిని ప్రభుత్వం పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కట్టుబడి వున్నాం: జనసేన