Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హస్తంకు జైకొట్టిన రాములమ్మ... ఖర్జే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం

Vijayashanti
, శుక్రవారం, 17 నవంబరు 2023 (18:14 IST)
సినీ నటి విజయశాంతి భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. కమలం పార్టీకి రాజీనామా చేసి హస్తానికి జైకొట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరినట్టయింది. శుక్రవారం హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 
 
ఇటీవల విజయశాంతి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపించారు. కిషన్‌ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ తీరుపై ఆమె ఆగ్రహంగా ఉన్నారు. 
 
తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆమె మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకోవడం గమనార్హం. 
 
కాగా, తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా ఆమె తల్లి తెలంగాణ పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత తెరాసలో చేరి మెదక్ ఎంపీగా గెలుపొందారు. పిమ్మట ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇపుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఆరు హామీలతో హ్యాపీ.. రాహుల్-ఖర్గేల రాక