Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

ఓ యువతి ప్రాణాలు తీసిన ఇద్దరు వ్యక్తుల గొడవ...

Advertiesment
deadbody

ఠాగూర్

, శుక్రవారం, 5 జనవరి 2024 (11:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఓ యువతి ప్రాణాలు తీసింది. దీంతో పెళ్లింటి విషాదం నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంట మండలం, రెడ్డిపల్లి కాలనీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి అనే వ్యక్తి కుమార్తె సువర్ణ వివాహం గురువారం జరిగింది. పెళ్లి కుమార్తెను ఊరేగింపుగా తీసుకెళ్లి కామారెడ్డి జిల్లా బికనూు మండలం లక్ష్మీదేవిపల్లిలోని మెట్టినింటికి పంపించారు. అయితే, తిరిగి ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్, స్వామి మధ్య గొడవ జరిగింది. 
 
ఈ ఘర్షణలో స్వామిని నరేందర్ నెట్టేశాడు. దీంతో కిందపడిన స్వామిని అక్కడున్న వారు పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన నరేందర్ తన థార్ కారును తీసుకొచ్చి అక్కడ ఉన్న పెళ్లి బందంపై ఎక్కించారు. ఈ ఘటనలో రమ్య (23) అనే యువతి తీవ్రంగా గాయపడటంతో, ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఇక ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నరేందర్ కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేశినేని నానిని పక్కన బెట్టిన చంద్రబాబు.. కారణం ఏంటంటే?