Publish Date: Fri, 15 Apr 2016 (17:17 IST)
Updated Date: Fri, 15 Apr 2016 (17:36 IST)
కర్నూలు జిల్లాలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగాలో జరిగాయి. జిల్లాలో ఉన్న శ్రీరాములవారి ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల ఆలయాలలో భజన మండలి వారు అఖండ నామ రామ సంకీర్తన నిర్వహించారు. నంద్యాలలో వాడవాడలా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.