Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైనా, కశ్యప్ అవుట్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్స్‌తో సరి!

సైనా, కశ్యప్ అవుట్ : ప్రపంచ బ్యాడ్మింటన్‌లో క్వార్టర్స్‌తో సరి!
FILE
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంయన్‌షిప్‌ నుంచి హైదరాబాద్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ అవుట్ అయ్యారు. క్వార్టర్ ఫైనల్లోనే సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పోరాటం ముగిసింది.

మహిళల సింగిల్స్ విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కొరియాకు చెందిన 13వ సీడ్‌ యువాన్ జు బే 21-23, 9-21తో సైనాను మట్టికరిపించింది. తద్వారా సైనా వరుస సెట్ల తేడాతో పరాజయం పాలైంది.

అలాగే పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ మూడో సీడ్ డు పెంగ్యు చేతిలో పోరాడి ఓడాడు. తొలి సెట్ ఓడిపోయి రెండో సెట్ గెల్చుకున్నా మళ్లీ మూడో సెట్లో తడబడడంతో కశ్యప్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో 21-16, 20-22,15-21తో డు పెంగ్యు విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu