గత కొద్ది కాలంగా ఐపీఎల్లో కొచ్చి ఫ్రాంచైజీ భవితవ్యం ఉన్న ఉత్కంఠతకు తెరపడింది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 4వ ఎడిషన్ (ఐపీఎల్-4)లో పాల్గొనేందుకు కొచ్చి టీమ్కు గ్రీన్సిగ్నల్ లభించింది. ఈ మేరకు రానున్న ఐపీఎల్ సీజన్-4లో కోచ్చి జట్టు కూడా ఆడనుంది.
ఈ విషంయపై ఆదివారం ముంబైలో సమావేశమైన ఐపీఎల్ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఐపీఎల్-4లో కొచ్చి ఎనిమిదవ జట్టుగా బరిలోకి దిగుతుంది. ఈ మేరకు కొచ్చి టీమ్ కొనుగోలు వ్యవహారంలో పెద్దల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో, పాలక మండలి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
"ఈ రోజు జరగిన సమావేశంలో బీసీసీఐ జారీ చేసిన నోటీసుకు కొచ్చి ఫ్రాంచైజీ సంతృప్తికరంగా స్పందించింది. దీంతో ఐపీల్-4లో కొచ్చి ఫ్రాంచైజీ పాల్గొనడాన్ని ఐపీఎల్ పాలక మండలి ఆమోదించింది. ఫ్రాంచైజీ కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ 2011 నుంచి ఐపీల్లో ఆడనుంద"ని బీసీసీఐ కార్యదర్శి ఎన్ శ్రీనివాసన్ తెలిపారు.