పంజాబ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో వరల్డ్ కబడ్డీ కప్ నిర్వహించనున్నారు. బటిండాలో మంగళవారం ఈ టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు.
కెప్టెన్గా సుఖ్బీర్ సింగ్ సర్వాన్ నియమితుడయ్యాడు. మొత్తం పద్నాలుగు దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. జట్టులో కెప్టెన్ సుఖ్బీర్తో పాటు హర్విందర్ సింగ్, గుల్జార్ సింగ్, మంగత్ సింగ్, నరిందర్ కుమార్లు పాత ముఖాలుగా కాగా, తొమ్మిది మంది కొత్త ఆటగాళ్లు వరల్డ్కప్ పోటీలతో అరంగేట్రం చేయనున్నారు.