మంగళవారం ఉదయం నుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 185 పాయింట్లు కోల్పోయి 19, 983 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 48 పాయింట్లను కోల్పోయి 6, 027 వద్ద ముగిసింది.
లాభాలను చవిచూసిన కంపెనీల్లో రోస్సెల్ టీ లిమిటెడ్, విప్పీ స్పిన్ప్రో లిమిటెడ్, షార్ప్ ఇండస్ట్రీస్, వర్థమాన్ ఇండస్ట్రీస్ తదితర ప్రముఖ కంపెనీలు ఉండగా, నష్టాలు చవిచూసిన కంపెనీల్లో మురుదేశ్వర్ సెరామిక్స్, మహవీర్ ఇన్ఫోవే, చెన్నై మీనాక్షి, శ్రీ భవానీ పేపర్ తదితర కంపెనీలున్నాయి.