Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టాక్ మార్కెట్ : 103 పాయింట్ల వృద్ధిలో సెన్సెక్స్

Advertiesment
బాంబే స్టాక్ మార్కెట్
, బుధవారం, 2 నవంబరు 2011 (13:03 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌పై గ్రీస్ రుణ సంక్షోభం ప్రభావితంచూపినట్టు కనిపించడం లేదు. దీంతో బుధవారం నష్టాలతో ఆరంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో వృద్ధి బాటలోకి పయనించింది. ఇది మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 103 పాయింట్లకు చేరుకుని 17,584 చేరుకుంది. నిఫ్టీ 31 పాయింట్ల వృద్ధితో 5,289 వద్ద కొనసాగుతోంది. ఆటో, బ్యాంకు, ఫార్మా, స్టీల్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు మదుపరులు ఆసస్తి చూపడంతో స్టాక్ మార్కెట్‌ లాభాల్లో పయనిస్తోంది.

భెల్, బజాజ్ ఆటో, సిప్లా, డీఎల్ఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హిండాల్కో ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, ఐటీసీ, జిందాల్ స్టీల్, జేపీ అసోసియేట్స్, లార్సెన్ అండ్ టర్బో, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, ఓన్‌జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా ఇండస్ట్రీస్, టాటా పవర్ కార్పొరేషన్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తుండగా, కోల్ ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, హీరో మోటార్‌కార్ప్, హిందుస్థాన్ యూనీలీవర్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, టాటా స్టీల్ నష్టాలను చవి చూస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu