Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయోధ్యలో రామాలయం.. మధ్యవర్తిగా ఆయనొద్దు: రామ్ విలాస్ వేదాంతి

హిందూ, ముస్లింల ఆమోదంతోనే అయోధ్యలో రాముని ఆలయ నిర్మాణం చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సంబంధించిన వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న ఆధ్యాత్మిక గురువు శ్రీ

Advertiesment
Ayodhya dispute
, మంగళవారం, 31 అక్టోబరు 2017 (14:28 IST)
హిందూ, ముస్లింల ఆమోదంతోనే అయోధ్యలో రాముని ఆలయ నిర్మాణం చేపట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సంబంధించిన వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. రవిశంకర్ నిర్ణయాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, బాబ్రీ యాక్షన్ కమిటీలతో పాటు మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి తిరస్కరించారు. 
 
అయోధ్యలో ఆయన రామ మందిర ప్రాంతాన్ని ఇప్పటివరకు దర్శించలేదన్నారు. అందుచేత ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించే అర్హత ఆయనకు లేదని స్పష్టం చేశారు. ముస్లిం మత పెద్దలు ముందుకు వచ్చి, చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరారు.
 
హిందువులు, ముస్లింల పరస్పర ఆమోదంతోనే ఆలయ నిర్మాణం జరగాలని తాము భావిస్తున్నట్టు విలాస్ వేదాంతి చెప్పుకొచ్చారు. రామ మందిర నిర్మాణం కోసం తాము కేసులకు భయపడకుండా పోరాటం చేశామని వేదాంతి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక పౌర్ణమి రోజున దీపదానం... సముద్ర స్నానం చేస్తే?